విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మహారాజా’ సినిమా గతేడాది (2024 జూన్ 14) విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వెనకబడ్డ విజయ్ సేతుపతిని సొలో హీరోగా నిలబెట్టిన చిత్రం అదే.

ఇప్పుడు ఇదే సక్సెస్ ఫుల్ కాంబో మళ్లీ మరో భారీ చిత్రానికి సిద్ధమవుతోంది. తాజా తమిళ మీడియా కథనాల ప్రకారం, విజయ్ సేతుపతి నిథిలన్‌ స్వామినాథన్ మళ్లీ కలిసి ఓ కొత్త స్క్రిప్ట్ పై పని చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతానికి కథా చర్చల దశలో ఉందని చెబుతున్నారు.

‘మహారాజా’ విజయం:

‘మహారాజా’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా దాదాపు ₹200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. అంతే కాదు, తరువాత చైనాలో కూడా విడుదల చేసి అక్కడా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

మరోసారి మక్కల్ సెల్వన్‌తోనే?

‘మహారాజా’ తర్వాత దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్ మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ విజయ్ సేతుపతితోనే మరో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారని సమాచారం. మరి, ఈ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందేమో చూడాలి.

‘మహారాజా’ కథ గురించి

రివెంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో, ఓ మనిషి తన జీవితాన్ని చిదిమేసిన వారికి శిక్ష ఇవ్వడానికై రూపొందించిన మాస్టర్‌ ప్లాన్ చుట్టూ కథ నడుస్తుంది.

ఈ చిత్రంలో నట్టి, అనురాగ్ కశ్యప్, అభిరామి, భరతిరాజా, మునీష్‌కాంత్, మణికందన్ కీలక పాత్రలు పోషించారు. ‘కాంతారా’ ఫేం అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించారు.

మరోసారి అదే మాంత్రిక కాంబినేషన్

‘మహారాజా’ ఫేం డైరెక్టర్ – మక్కల్ సెల్వన్ హీరోగా రాబోతున్న ఈ కొత్త సినిమా పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ అప్‌డేట్స్‌ మేకర్స్ నుంచి వచ్చినట్టే అయితే… ఇది తమిళ సినిమాకే కాదు, సౌత్ ఇండస్ట్రీకి మరో గట్టి హిట్ ఇవ్వనున్న ప్రాజెక్ట్ అవ్వనుంది

, ,
You may also like
Latest Posts from